కమెడియన్ అలీ, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న అనుబంధం అందరికి తెలిసిందే. వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి. ఎన్నికల ముందు అలీ వైస్సార్సీపీ లో చేరిన తరువాత వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. ఎన్నికల సమయంలో ఒకరిపై మరొకరు ఆరోపణలు కూడా చేసుకున్నారు.
లాక్ డౌన్ సమయంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకి పవన్ కళ్యాణ్ ప్రతి సంవత్సరం మామిడి పళ్ళు పంపేవారని కానీ ఈ సంవత్సరం పంపలేదని చెప్పారు. రాజకీయాల్లో బిజీ గా ఉండటం వల్ల బహుశా ఈ సారి పంపలేదేమో అని అభిప్రాయపడ్డారు. వచ్చే సంవత్సరం అయినా పంపుతారేమో అని ఆశాభావం వ్యక్తం చేసారు.
Follow us: